Monday, April 29, 2024

చేపల వేటకు వెళ్లి తండ్రి మృతి..కుమారుడు గల్లంతు

- Advertisement -
- Advertisement -

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పట్టణంలోని హరిజనవాడకు చెందిన శివన్, ఆయన కుమారుడు రిషికేశ్ నగర శివారులో గల నల్ల చెరువులో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు ఇద్దరు చెరువులో పడి మునిగిపోయారు. ఈత రాక పోవడంతో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రిస్క్యూ సిబ్బంది చెరువు లో వెతకగా తండ్రి మృత దేహాం లభ్యమైంది. గల్లంతైన రిషికేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News