Monday, May 6, 2024

బాలికపై అత్యాచారం.. దోషికి 10ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

Jail

మనతెలంగాణ/హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి మంగళవారం నాడు సంగారెడ్డి పోక్సో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో బాలికకు వరుసకు అన్న అయిన డియ్యగాల నవీన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అప్పుడు జిల్లాలో కలకలం సృష్టంచింది. ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. పకడ్భందీగా సాక్ష్యాలను సేకరించి పోక్సో కోర్టుకు సమర్పించారు. దీంతో నిందితుడిపై నేరం రుజువు కావడంతో అతడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంగారెడ్డి పోక్సో కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. అంతేకాకుండా నిందితుడికి మూడు వేల రూపాయల జరిమానా విధించారు.

Man gets 10 years RI by sangareddy court for raping girl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News