Saturday, April 27, 2024

ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదు

- Advertisement -
- Advertisement -

Manchu Vishnu

తిరుమల: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎన్నిక‌లో గెలిచిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. సోమవారం మంచు విష్ణు తన తండ్రి మోషన్ బాబు, తన ప్యానల్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానెల్‌ గెలిచినందుకు స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చామన్నారు. ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు మీడియా ద్వారానే విన్నామని, ఇప్పటివరకు వారినుంచి ఎలాంటి రాజీనామా లేఖలు రాలేదని చెప్పారు. ఒకవేళ రాజీనామా లేఖలు వస్తే అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తామని పేర్కొన్నారు.

 కాగా, ‘మా’ ఎన్నికల్లో గెలిచిన 11మంది ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘మా’ సంక్షేమం కోసం మాత్రమే తాము రాజీనామా చేస్తున్నామని తెలిపారు.

Manchu Vishnu reacts on Resignation of Prakash Raj Panel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News