Sunday, April 28, 2024

మహారాష్ట్ర బిఆర్‌ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ఈ నెల 6న మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించిన బిఆర్‌ఎస్ పార్టీ తాజాగా మహారాష్ట్ర బిఆర్‌ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్‌ను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ నియమించారు.

ఈమేరకు ఆదివారం బిఆర్‌ఎస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్ చడూనీని నియమించిన విషయం తెలిసిందే. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో బిఆర్‌ఎస్ పార్టీ ముందుకు పోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News