Saturday, April 27, 2024

భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో నక్సల్ మృతి

- Advertisement -
- Advertisement -

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో బుధవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఒక నక్సల్ మరణించాడు. జగర్‌గుండ పోలీసు స్టేషన్ పరిధిలోని మిలియంపల్లి-రాజపెంట గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజి పి సుందర్‌రాజ్ తెలిపారు. నక్సల్ నిరోధక ఆపరేషన్‌లో ఉన్న భద్రతా దళాలు అటవీ ప్రాంతంలో గాలింపు సాగిస్తుండగా ఈ సంఘటన జరిగిందని ఆయన చెప్పారు. చనిపోయిన నక్సల్ యూనిఫారమ్‌లో ఉన్నాడని, సంఘటన స్థలం నుంచి ఒక నాటు తుపాకి, రెండు రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. మృతుని వివరాలు ఇంకా తెలియరావలసి ఉందని ఆయన అన్నారు.

Maoist Killed in Chhattisgarh Encounter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News