Saturday, April 27, 2024

25న రాష్ట్రబంద్‌కు మావోయిస్టుల పిలుపు..

- Advertisement -
- Advertisement -

Maoists call for Telangana state bandh on July 25

మనతెలంగాణ/హైదరాబాద్: ఆడవుల నుంచి గ్రేహాండ్స్ బలగాలను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మంగళవారం మావోయిస్ట్ తెలంగాణ కార్యదర్శి జగన్ రాశారు. విరసం నేత వరవరరావును వెంటనే విడుదల చేయాలని ఉపా, ఎన్‌ఐఎ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. నిర్భంధ పరిస్థితులలోనూ తప్పకుండా బంద్ నిర్వహించి తీరుతామన్నారు. విరసం నేత వరవరరావుపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరింది. ఉపా, ఎన్‌ఐఎ కేసులు ఎత్తివేయడంతో పాటు అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ ఆ లేఖలో కోరింది. ఇదిలావుండగా ఇటీవల రాష్ట్రంలో మావోల అలజడి మొదలవ్వడంతో అప్రమత్తమైన గ్రేహౌండ్స్ బలగాలు అడవుల్లో జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఓ లేఖ రాసిన మావోల కార్యదర్శి జగన్ తాజాగా మరో లేఖను విడుదల చేయడంతో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Maoists call for Telangana state bandh on July 25

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News