Friday, May 3, 2024

విమానాల్లో మాస్క్‌లు తప్పనిసరికాదు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : విమాన ప్రయాణాలలో మాస్క్‌లు తప్పనిసరి ఏమి కాదు, అయితే వీటిని మంచిదని కేంద్ర పౌరవిమానాయాన మంత్రిత్వశాఖ బుధవారం సలహాలు వెలువరించింది. కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికుల ఆరోగ్యపర జాగ్రత్తల గురించి మంత్రిత్వశాఖ ప్రస్తావించింది.

ఇప్పటివరకూ విమానాలలో ప్రయాణాల సందర్భంలో మాస్క్‌లు లేదా నోటికి ముఖానికి కవర్స్ వాడకం తప్పనిసరిగా ఉంది. అయితే ఈ నిర్బంధ పద్ధతిని సడలించారు. మాస్క్‌లు ఇతరత్రా వస్త్రాలు ముఖానికి తగిలించుకోవడం వ్యక్తిగతం అని, అయితే వీటిని ధరిస్తే మంచిదని హితవు పలికారు. కోవిడ్ వైరస్ నిర్వాహణల పద్ధతిలో తరచూ జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఇప్పుడు తాజా నిర్ణయాన్ని వెలువరించారు. ఇప్పటికైతే కోవిడ్ తీవ్రత లేదు. అయితే సమసిపోలేదు.

ఈ నేపథ్యంలో ఎవరికి వారు విమాన ప్రయాణాల దశలో సొంత జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌ల ధారణ వారివారి ఇష్టానికే వదిలిపెడుతున్నామని తెలిపారు. ఇప్పటి నిర్ణయం నేపథ్యంలో ఇకపై విమాన ప్రయాణాల దశలో మాస్క్‌లు వేసుకోకపోతే ఫైన్ లేదా ఇతరత్రా శిక్షలుంటాయనే అధికారిక ప్రకటనలు వెలువరించడం ఏదీ ఉండదని తెలిపారు. దేశంలో ఇప్పుడు మొత్తం కరోనా కేసులలో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం ౦.2 శాతంగానే ఉంది. రికవరీ రేటు దాదాపు 99 శాతానికి చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా సోకి నయం అయిన వారి సంఖ్య 4,41,28,580కు చేరుకుంది, కరోనాతో మరణాల సంఖ్య 1.19 శాతంగా రికార్డు అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News