Thursday, May 9, 2024

మిస్టీరియస్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

విన్ క్లౌడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ లక్ష్మీ పిక్చర్స్ పతాకంపై జీరో ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న తాజా చిత్రం మాయ. రాజేష్ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. మిస్టీరియస్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో కిరణ్ ఆవల మాట్లాడుతూ డైరెక్టర్ రమేష్ నాని మొదటిసారి ఇంటికొచ్చి ఈ స్టోరీ చెప్పినప్పుడు, మూవీ స్క్రీన్ ప్లే విన్న వెంటనే సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మానని తెలిపారు.

నిర్మాత రాజేష్ గురిజవోలు మాట్లాడు-తూ “రమేష్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేశాము. ఈ ప్రాజెక్టులోకి హీరోయిన్ ఎస్తర్ రావడం ప్రధాన బలం”అని అన్నారు. మాయా చిత్రం ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం ప్రొడ్యూసర్ రాజేష్ అని డైరెక్టర్ రమేష్ పేర్కొన్నారు. ఎస్తర్ నోరన్హా మాట్లాడుతూ ఇది క్రైమ్ స్టోరీ అయినప్పటికీ సినిమాలో ఎమోషన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమరదీప్, సత్యం రాజేష్, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News