Saturday, May 4, 2024

ప్రధాని మోడీ ఒంటెద్దు పోకడలు పోతున్నారు: మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Minister Errabelli Comments on PM Narendra Modi

హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులను అభివృద్ధి చేశామన్నారు. ప్రధాని మోడీ ఒంటెద్దు పోకడలు పోతున్నారని స్పష్టం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేందుకు కొత్త వ్యవసాయ చట్టాలు చేశారని ఆరోపించారు. కరువు జిల్లాలు కూడా సిఎం కెసిఆర్ కృషి వల్ల సస్యశ్యామలం అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. దిగుబడి వచ్చిన మొత్తం ధాన్యాన్ని కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. విదేశాల నుంచి మక్కల దిగుమతికి అనుమతి వల్ల రాష్ట్ర రైతులు నష్టపోతున్నారని సూచించారు. కొత్త వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు బిజెపిపై పోరాడుతామన్నారు. కొత్త చట్టాల వల్ల రాష్ట్రంలోని మార్కెట్లు, ఎఫ్ సిఐ కూడా మూతపడే పరిస్థితి ఉందని వివరించారు. ఈ నెల 8న జరిగే బంద్ కు రాష్ట్రంలోని ప్రజలు సంపూర్ణ మద్ధతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Minister Errabelli Comments on PM Narendra Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News