Saturday, April 27, 2024

కరోనా నుంచి కోలుకున్న మంత్రి సత్యేందర్ జైన్

- Advertisement -
- Advertisement -

Minister Satyendar Jain recovered from Corona

 

ఢిల్లీ : ఇటీవలే కరోనా వైరస్ సోకిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌కు తాజా పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. ప్లాస్మా చికిత్స చేయడంతో ఆయన ఆరోగ్యం మెరుగు పడిందని వైద్యులు తెలిపారు. మంత్రి సత్యేందర్‌కు ఈ నెల 17న కరోనా రావడంతో ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఐసియూలో చికిత్స అందించారు వైద్యులు. ప్లాస్మా చికిత్స అనంతరం ఐసియూ నుంచి జూన్ 22న సాధారన వార్డుకు మంత్రి సత్యేందర్‌ను తరలించారు. దీంతో ఆయన శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 73,780 కేసులు, 2,429 మరణాలు సంభవించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News