Friday, May 3, 2024

ఘటాల ఊరేగింపును ప్రారంభించిన మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani Srinivas Yadav Offers Bangaru Bonam

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఆషాడ బోనాల సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్ లోని కట్టమైసమ్మ అమ్మవారికి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో 501 బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్ఎ ముఠా గోపాల్ తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందిస్తుందని తెలిపారు.

ఘటాల ఊరేగింపు ను ప్రారంభించిన మంత్రి తలసాని

సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఘటాల ఊరేగింపును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుచిత్ర, ఇవో మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

 

Minister Talasani Srinivas Yadav Offers Bangaru Bonam

Minister Talasani Srinivas Yadav Offers Bangaru Bonam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News