Monday, April 29, 2024

‘సుప్రీం’లో ఎంఎల్‌సి కవితకు ఊరట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో భాగంగా గత మార్చి నెలలో ఎంఎల్‌సి కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణకు హాజరైన సంగతి విదితమే. ఈ విచారణకు నోటీసులు ఇచ్చిన విషయంలో ఓ మహిళను ఇడి కార్యాలయానికి పిలిపించవచ్చా అనే దానిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఎంఎల్‌సి కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఎంఎల్‌సి ఎమ్మెల్సీ కవిత పక్షాన నిలిచింది. ఇడిపై కవిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. విచారణ కోసం మహిళను ఇడి కార్యాలయానికి పిలిపించవచ్చా? లేదా? అన్న అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మహిళను ఢిల్లీలోని ఇడి కార్యాలయానికి పిలిపించి విచారించడానికి సవాల్ చేస్తూ ఎంఎల్‌సి కవిత పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ ధర్మాసనం విచారణ చేసింది. కవిత పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని, ఆ పిటిషన్‌పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఇడిని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని కవితకు సూచించింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహద్గీ వాదనలు వినిపించారు. విచారణకు తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచందర్‌రావు కూడా హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News