Monday, April 29, 2024

దళితులను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం..

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: దళితులను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్ర్యం తప్ప మరొకటి కాదని విమర్శించారు. ఖర్గే వచ్చి ఎస్సీ డిక్లరేషన్ చేయడం అర్రస్ పాట పాడినట్టు ఉందని, రాజకీయం కోసం తప్ప దళితుల కోసం చేసేదేమీ లేదని అన్నారు. ఇన్ని రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏమి చేసిందని ప్రశ్నించారు.

రైతుల కోసం బిజెపి మీటింగ్ పెట్టడం ఆ సభకు అమిత్ షా రావడం హంతకుడే రైతులకు సంతాపం తెలిపినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దలితుల కోసం పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని కుంటి సాకుగా చెప్తూ ఉచిత పథకాలను ఎత్తి వేసిందని ఆరోపించారు. తెలంగాణలో ప్రారంభించిన రైతు బందును కాపీ కొట్టిన మోడీ ప్రభుత్వం 13 కోట్ల మందికి రైతు బంధు ప్రారంభించి.. 2.5 కోట్ల మందికే ఇస్తున్నారని, మన రాష్ట్రంలో మాత్రం అందరికీ ఇస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News