Tuesday, April 30, 2024

హైదరాబాద్ చుట్టూ 25 టోల్ గేట్లతో పన్ను వసూలు: నామా

- Advertisement -
- Advertisement -

Modi govt tax charged in toll gates in Hyderabad

హైదరాబాద్: అన్ని ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించినట్లే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయ్యాలని ఎంపి నామా నాగేశ్వర్ రావు హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచిన నలుగురు బిజెపి ఎంపిలు లోక్ సభలో హైదరాబాద్, తెలంగాణ ప్రజల గురించి ఒక్కసారైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టూ 25 టోల్‌గేట్లు పెట్టి కేంద్ర డబ్బులు వసూలు చేస్తోందని ఆ్రగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారనే అహంతో అధికారం కోసం హైదరాబాద్‌లో బిజెపి నేతల జిమ్మికులు సరికావన్నారు. ఏం మాట్లాడిన కేంద్రం నుంచి తెలంగాణకు తాము నిధులిచ్చామని బిజెపి నేతలు మాట్లాడుతున్నారని, తెలంగాణ నుంచి రూ.2.75 లక్షల కోట్లు పన్నుల రూపంలో తీసుకెళ్లారని, ఇందులో సగం నిధులు కూడా తెలంగాణకు విడుదల చేయలేదని దుయ్యబట్టారు. విమానం, రైల్వే ప్రయాణికుల వద్ద కేంద్రం పన్నులు వసూలు చేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News