- Advertisement -
సిడ్నీ: ఆస్ట్రేలియా- భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ జట్టు 41 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ సెంచరీతో కదం తొక్కాడు. డేవిడ్ వార్నర్ 69 పరుగులు చేసి షమీ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫించ్ 124 బంతుల్లో 114 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో రాహుల్ కు ఇచ్చి ఔటయ్యాడు. స్టయినిస్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో మైదానం వీడాడు. తొలి వికెట్ కు ఓపెనర్లు 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో స్టీవెన్ స్మిత్ (70), మ్యాక్స్ వెల్(1) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలర్లలో షమీ, బుమ్రా, చాహల్ తలో ఒక వికెట్ తీశారు.
- Advertisement -