Monday, April 29, 2024

ఆ సంబంధం బయటపడుతుందని…. ప్రియురాలి తనయుడిని కొట్టి చంపిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: వివాహేతర సంబంధాన్ని తన తండ్రికి చెబుతాననడంతో ప్రియురాలి తనయుడిని ప్రియుడు కొట్టడంతో ఆ బాలుడు మృతి చెందిన సంఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అంటోనీ ప్రకాశ్ అనే వ్యక్తి దీపాను 2015లో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. ప్రకాశ్ ఆఫీస్‌కు వెళ్లినప్పుడు తన ప్రియుడి సోరిమూత్తుతో కలిసి ప్రియురాలు దీపా తిరునెల్వెళ్లిలో ఓ లాడ్డ్‌కు వెళ్లింది. తన మూడేళ్ల కుమారుడిని కూడా లాడ్జ్‌కు తీసుకెళ్లింది. వివాహేతర సంబంధాన్ని తన తండ్రికి చెబుతానని లోకేష్ అనడంతో ఆ బాలుడిని సోరిముత్తు తీవ్రంగా కొట్టాడు. వెంటనే ఆ బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఆస్పత్రిలో బాలుడు చికిత్స పొందుతుండగా సోరిముత్తు తనని కొట్టాడని తండ్రికి లోకేష్ తెలిపాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోకేష్ చనిపోవడంతో బాలుడి తండ్రి ప్రకాశ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దీపాను అరెస్టు చేయడమే కాకుండా సోరిముత్తు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

Mother.s Lover beat boy informs father about affair
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News