Monday, April 29, 2024

పుట్టిన రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎర్రవల్లి నివాసంలో సిల్వర్ ఓక్ మొక్కలను నాటారు. పర్యావరణ రక్షణతో పాటు, మొక్కలు నాటడం ద్వారా మన ప్రకృతిని కాపాడుకునేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఎంపి సంతోష్ తెలిపారు. పుట్టిన రోజుతో పాటు, సందర్భం ఏదైనా మొక్కలు నాటే సంప్రదాయం ప్రతీ ఒక్కరూ కొనసాగించాలని ఆయన కోరారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News