- Advertisement -
అమరావతి: 9 ఏళ్లుగా ప్రతి ఏడాది తమ కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రకటిస్తున్నామని మాజీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టిఆర్ ట్రస్ట్ను మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారన్నారు. గతేడాదితో పోలిస్తే చంద్రబాబు ఆస్తులు రూ.87 లక్షలు పెరిగాయని ప్రకటించారు. చంద్రబాబు ఆస్తి రూ.9 కోట్లు ఉండగా అప్పులు రూ.5 కోట్ల 13 లక్షలు కాగా నారా భువనేశ్వరి ఆస్తులు రూ.50 కోట్లు అని, లోకేష్ ఆస్తి రూ.24 కోట్లు అని, బ్రాహ్మిణి ఆస్తి రూ.15.68 కోట్లు అని, దేవాన్ష్ ఆస్తి రూ.19.42 కోట్లుగా ఉందని వెల్లడించారు. మా అమ్మగారు 23 ఏళ్లుగా హెరిటేజ్లో పని చేస్తున్నారన్నారు. నా పేరిట ఉన్న షేర్లను బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చానన్నారు. గత సంవత్సరం నారా లోకేష్ ఆస్తి రూ.27 కోట్ల నుంచి రూ.24 కోట్లకు తగ్గిందన్నారు.
Nara Lokesh declares assets of Chandrababu, family
- Advertisement -