Saturday, April 27, 2024

నార్ముల్ చైర్మన్ గా గంగుల కృష్ణా రెడ్డి

- Advertisement -
- Advertisement -

హయత్ నగర్: నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తి దారుల సహాయక సహకార యూనియన్ చైర్మన్ గా గంగుల కృష్ణారెడ్డిని బోర్డు డైరెక్టర్లు ఎన్నుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో హయత్ నగర్ మదర్ డైరీ లో జరిగిన సమావేశంలో కృష్ణారెడ్డిని బోర్డు డైరెక్టర్లు ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు డాక్టర్ గాధరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, రవీందర్ కుమార్, ఫైళ్ల శేఖర్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, నార్ముల్ తాజా మాజీ ఛైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. హయత్ నగర్ మదర్ డైరీ ప్రాంగణంలో జరుగుతున్న సమావేశంలో గంగుల కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.  నార్ముల్ మాజీ ఛైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి పదవీ విరమణ పొందిన వెంటనే ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News