న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ తో దేశంలో నిజాముద్దీన్ మర్కజ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వెళ్లి వచ్చిన వారిలో కొందరికి కరోనా పాజిటీవ్ రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతాన్ని సందర్శించారు. మరోవైపు, పలు రాష్ట్రాలు ఢిల్లీకి వెళ్లిన వారిని గుర్తించి, వారిని క్యారంటైన్ కు తరలిస్తున్నాయి. బుధవారం నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతాన్ని ఢిల్లీ మున్సిపల్ అధికారులు శానిటైజేషన్ చేశారు. తర్వాత ఆ ప్రాంతాన్ని ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు కూడా సందర్శించారు. 36 గంటల ఆపరేషన్ లో నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతం నుంచి 2,361 మందిని అధికారులు తరలించారు. ఇందులో 617 మందిని ఆస్పత్రిలో చేర్పించగా, మిగతావారిని నిర్భంద కేంద్రాలకు తరలించారు. వీరి జాబితాను పోలీసులు అన్ని విభాగాలకు అందించారు.
National Security Advisor Ajit Doval Visits Nizamuddin