Monday, April 29, 2024

నవ దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Suicide

 

లక్నో: నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా ప్రాంతంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… 2020 జనవరి 18న ప్రియా (20), గోపాల్(21) అనే యువతి యువకుడు పెళ్లి చేసుకున్నారు. వాళ్లు గోపాల్ కుటుంబ సభ్యులతో కలిసి రామ్‌స్వరూప్ కాలనీలో నివసిస్తున్నారు. గోపాల్ చెల్లెలు మంగళవారం రాత్రి 10.30 ప్రాంతంలో వాళ్లు రూమ్ దగ్గరికి వెళ్లింది. రూమ్ లోపల నుంచి లాక్ చేసి ఉండడంతో కిటికీలో నుంచి చూసేసరికి వాళ్ల ఉరేసుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోహమండి ప్రాంతం సిఐ నమ్రిత శ్రివాత్సవ్ మీడియాతో మాట్లాడారు. దంపతుల ఆత్మహత్యకు సరైన కారణాలు తెలియవని, గత కొన్ని రోజుల నుంచి తండ్రితో గోపాల్‌కు గొడవలు ఉన్నాయని బంధువులు తెలిపారు. గోపాల్ తన తండ్రి జువెల్లర్ షాప్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రియా తల్లిదండ్రులు ఫిరోజాబాద్ జిల్లాలోని షికోహబాద్ నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఆ దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

 

UP Newly-married couple commits suicide in Agra
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News