- Advertisement -
లక్నో: క్వారంటైన్లో పుట్టిన బిడ్డకు ఓ తల్లి కోవిద్ అని నామకరణం చేసిన సంఘటన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని రామ్పూర్లో జరిగింది. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించడంతో కూలీలు తన సొంతూళ్లకు కాలినడకన బయలుదేరారు. ఫరీదాబాద్లో ఓ హోటల్లో పని చేసే నేపాలీ దేశానికి చెందిన వ్యక్తి తన భార్యతో కలిసి నేపాలీ వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని క్వారంటైన్కు తరలించారు. నిండు గర్భిణీగా ఉన్న ఆమె క్వారంటైన్లో పండంటి బిడ్డకు జన్మనించింది. దీంతో తన బాబుకు ఆ దంపతులు కోవిద్ పేరు పెట్టారు.
Newborn baby boy in Rampur named Covid in Lockdown
- Advertisement -