Monday, April 29, 2024

అయోధ్యకు వెళ్లడంపై తగిన సమయంలో నిర్ణయం

- Advertisement -
- Advertisement -

సోనియా, ఖర్గేకు ఆహ్వానంపై కాంగ్రెస్ వివరణ

న్యూఢిల్లీ: అయోధ్యలో జనవరి 22న జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ హాజరయ్యే విషయంపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది.

అయోధ్యలో జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవానికి సోనియా గాంధీ, ఖర్గేకలు ఆహ్వానం అందిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శుక్రవారం నాడిక్కడ విలేకరులకు తెలిపారు. ఆ కార్యక్రమానికి వెళ్లడంపై తగిన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుని తెలియచేస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నాయకుడుఅధిర్ రంజన్ చౌదరికి కూడా ఆహ్వానం అందినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News