Monday, April 29, 2024

ఐఎఎస్ శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఐఎఎస్ శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవద్దని సిబిఐ కోర్టుకు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఒఎంసి చార్జిషీట్‌పై విచారణ ఆపాలని శ్రీలక్షి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈక్రమంలో ఒఎంసి కేసులో కీలకమైన సరిహద్దు వివాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు విచారణ ఆపాలని శ్రీలక్ష్మి కోర్టును కోరారు. దీంతో ఒఎంసి కేసు దర్యాప్తు పూర్తైందని మరో చార్జిషీట్ వేయబోమని సిబిఐ పేర్కొంది. దర్యాప్తు అధికారి వాంగ్మూలాన్ని సిబిఐ కోర్టు ఇప్పటికే పరిగణనలోకి తీసుకుందని సిబిఐ తెలిపింది. లిఖితపూర్వకంగా సమర్పించాలని సిబిఐకి హైకోర్టు ఆదేశించింది.

Not to take action on IAS Srilaxmi: High Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News