ఉప్పల్: వ్యసనాలకు బానిసగా మారిన ఓ హమాలీ ఉల్లిగడ్డలను దొంగిలించి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.1,50, 000 విలువైన 91 కిలోల ఉల్లిగడ్డలను స్వాధీనం చేసుకున్నా రు. నగరంలోని గౌలిపురా మార్కెట్కు చెందిన అభిషేక్ దీక్షిత్ చిన్నప్పుడే చదువుకు స్వస్తి చెప్పాడు. గౌలిపురా మార్కెట్లో హమాలీగా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారడంతో వచ్చే డబ్బులు సరిపోవడంలేదు. దీంతో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉప్పల్ కూరగాయల మార్కెట్లోని మూడు షాపుల్లో ఉల్లిగడ్డలను చోరీ చేశాడు.
ట్రాలీ ఆటోను, హమాలీలతో షాపు నుంచి ఉల్లిగడ్డలు చోరీ చేసి గౌలిపుర మార్కెట్కు తరలించి విక్రయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్ప్పెక్టర్ పోచయ్య, డిఎస్సీ బలరామరాజు, సిబ్బంది నిందితుడిని అరెస్టు చేశారు.
Onions Robber Arrested in Uppal