Friday, May 3, 2024

పల్లవి మోడల్ స్కూల్ బస్సు ఢీకొని మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని  పల్లవి మోడల్ స్కూల్ బస్సు ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది.  కార్ఖానా పోలీస్ స్టేషన్  పరిధిలో పల్లవి మోడల్ హై స్కూల్ బస్సు మహిళను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే సదరు మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతురాలు జ్యోతి (42) పల్లవి స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: అన్నం వండిపెట్టలేదని తల్లిని తగలబెట్టిన కుమారుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News