- Advertisement -
సూర్యాపేట: పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ లో జరిగింది. ఆరె హరీష్ అనే వ్యక్తి పాలవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. తన చదువుకు తగిన ఉద్యోగం రాలేదని పలుమార్లు కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించేవాడు. దీంతోనే హరీష్ ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -