Monday, April 29, 2024

ఏపిలో పట్టుబడిన పంజాగుట్ట మాజీ సిఐ

- Advertisement -
- Advertisement -

పంజాగుట్ట మాజీ సర్కిల్ ఇన్ స్పెక్టర్ దుర్గారావును పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడు. ఈ కేసులో ఆయన ఏ11గా ఉన్నారు. వారం రోజులుగా పరారీలో ఉన్న దుర్గారావును అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేశారు.

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ మితిమీరిన వేగంగా కారులో వెళ్తూ తెలంగాణా ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ కేసునుంచి సాహిల్ ను తప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణపై దుర్గారావును పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News