Sunday, April 28, 2024

‘పేట’ సిగలో పారిశ్రామిక కిరీటం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:అభివృద్ధిలో పరుగులు పెడుతున్న సూర్యాపేట ఒడిలో ఇమాంపేట ఆటోనగర్ మరో మణిహీరం కానుంది. జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న ఇమాం పేటలో ఆటోనగర్ నిర్మాణానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటక ండ్ల జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ప్ర స్తుతం ఇదే ప్రా ంతంలో 69 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కు శ్రీ కారం చుట్టనున్నారు.

ఈ మేరకు శనివారం ఉదయం ఇమాంపేటలోని ఆటోనగర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండి నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఆర్డిఓ ఇత ర అధికారులతో కలిసి ఆటోనగర్ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి అ క్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి చొరవతో త్వరలో వ ందలాది పరిశ్రమలు ఇక్కడ కొలువుతీరనున్నాయి.తాజాగా ఏ ర్పా టు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్‌తో యువతకు, కార్మికులకు మ రి న్ని అవకాశాలు లభిస్తాయి. ఈ మేరకు నిర్మాణాల కోసం రూ. 16 కోట్ల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

సకల హంగులు.. అద్భుత నిర్మాణాలు
నభూతో…నభవిష్యత్ అన్న రీతిలో ఇమామ్‌పేట ఇండస్ట్రియల్ పార్క్ లో సకల హంగులతో నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి. పారిశ్రామిక పార్క్ ముందు ఆకట్టుకునే కమాన్, ముందు రహదారి నుండి చివరి వరకు విశాలమైన రహదారులు, కార్మికుల శ్రేయస్సు కోసం కార్మిక సంక్షేమ భవనం, ఆరి ఆరోగ్యం కోసం సకల సదుపాయాలతో ఈఎస్‌ఐ ఆసుపత్రి వంటి నిర్మాణాలు రూపు దిద్దుకోనున్నాయి.

నిర్మాణాల నాణ్యతలో రాజీపడే ప్రసక్తేలేదని మంత్రి జగదీష్ రెడ్డి అ ధికారులకు సూచించారు. అతి త్వరలో పనులు ప్రారంభించనున్న ట్లు తెలిపారు. అత్యాధునిక పారిశ్రామిక పార్క్‌లో ఇంకా చేపట్టవలసిన నిర్మాణాలు, సౌకర్యాల పై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News