Monday, April 29, 2024

కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న విమానం

- Advertisement -
- Advertisement -
Plane hits pole at Gannavaram airport
గన్నవరంలో తప్పిన పెనుముప్పు

విజయవాడ : ఎయిరిండియా విమానం ఒకటి ల్యాండింగ్ దశలో అక్కడి కరెంట్ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి మధుసూదన్ రావు తెలిపారు. దోహా నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అవుతూ ఉండగా పోల్‌కు తగిలింది. దీనితో స్తంభం విరిగి కిందపడింది. విమానం రెక్క స్వల్పంగా దెబ్బతింది. విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి మొత్తం 64 మంది ఉన్నారు. ఈ విమానం విజయవాడ మీదుగా కేరళకు వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని, ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని అధికారి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News