- Advertisement -
హైదరాబాద్: సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. మూడు రాష్ట్రాలు విమానాలు వద్దని తెలిపాయి. మహారాష్ట్ర, తమిళనాడు భారీగా కేసులు నమోదవుతున్న సందర్భంగా విమాన రాకపోకలు వద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ముంబయి, చెన్నై, కోల్కతా నుంచి విమానాల రాకపోకలను ఆ రాష్ట్రాలు నిషేధించాయి. విమానాలు నడపడంపై మాహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. హాట్స్పాట్స్కు ప్రజలు వస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. మూడు నగరాల నుంచి వేలల్లో టికెట్లు బుక్ అయ్యాయి. ప్రభుత్వాల నిర్ణయంతో ప్రయాణికులు నిరుత్సాహం పడుతున్నారు. టికెట్ల సొమ్మును విమానయాన సంస్థలు వెనక్కి ఇస్తున్నాయి.
- Advertisement -