Friday, April 26, 2024

దేశప్రజలకు ప్రధాని మోడీ రంజాన్ శుభాకాంక్షలు..

- Advertisement -
- Advertisement -

PM Modi

 

న్యూఢిల్లీ: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందిస్తుందని, దేశపౌరులు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ..‌ కరుణ, సేవాతత్పరత, సుహృద్బావానికి రంజాన్‌ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధిని కలుగజేయాలని ఆకాంక్షిస్తున్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు. కాగా, కరోనా నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ముస్లిం సోదరులు ఇళ్లల్లోనే రంజాన్ ప్రార్థనలు జరుపుకుంటున్నారు.

PM Modi Eid-ul-Fitr Greetings to People

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News