Monday, April 29, 2024

కాంగ్రెస్‌కు బెట్టింగ్ యాప్: ప్రధాని మోడీ విమర్శ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇప్పటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారదశలో కాంగ్రెస్ పార్టీ బెట్టింగ్ యాప్ నుంచి అందిన దొడ్డిదారి సొమ్మును వెదజల్లుతోందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. దుబాయ్ కేంద్రంగా ఉన్న మహాదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి కాంగ్రెస్‌కు భారీ స్థాయిలో నిధులు అందాయని, ఈ విషయం ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ సిఎం భూపేష్ బఘేల్‌కు అందిన రూ 500 కోట్ల పై చిలుకు డబ్బు వ్యవహారంతో స్పష్టం అయిందని మోడీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని మోడీ శనివారం దుర్గ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కొరియర్ ఒక్కరు ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు అయ్యారని,

క్రమం తప్పకుండా ఈ బెట్టింగ్ యాప్ నుంచి ఛత్తీస్ సిఎంకు ముడుపులు అందుతున్నాయని ఈ వ్యక్తి దర్యాప్తు సంస్థలకు తెలిపారని,ఈ వ్యవహారం ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తులో ఉందని మోడీ తెలిపారు. అక్రమంగా ప్రజల డబ్బును కొల్లగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు తిరిగి అధికారం కోసం వీటిని వాడుకొంటోందని, ఈ విధంగా అక్రమాల కాంగ్రెస్ అక్రమ నిధుల దుర్వినియోగం జరుగుతోందన్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీ శివుడి పేరిట వెలిసిన మహాదేవ్ గ్రూప్‌ను తన అక్రమ సంపాదనకు వాడుకొంటోందని ఈ విధంగా శివుడి పేరును మలినపర్చారని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌ను దోచుకున్న వారి నుంచి అంతా వెలికితీస్తామని మోడీ హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రచారానికి హవాలా సొమ్ములు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శ
కేంద్ర మంత్రి స్మతి ఇరానీ కూడా కాంగ్రెస్ అక్రమ నిధుల వ్యవహారం బయటపడిందని విమర్శించారు. ఛత్తీస్‌గడ్‌లో పార్టీ ఎన్నికల ప్రచారానికి హవాలా సొమ్ము దండిగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ బోగస్ కంపెనీల ద్వారా హవాలాల రూపంలో మహాదేవ్ యాప్ నుంచి ఛత్తీస్‌గఢ్ సిఎంకు ఇటీవలి కాలంలో భారీగా సొమ్ము అందినట్లు వెల్లడైందని కేంద్ర మంత్రి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News