Saturday, April 27, 2024

ఎ-1గా చేర్చిన పోలీసులు.. అజ్ఞాతంలోకి బిగ్‌బాస్‌ 7 విన్నర్‌

- Advertisement -
- Advertisement -

బిగ్‌బాస్‌ 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్ కు మరో షాకిచ్చారు జూబ్లీహిల్స్ పోలీసులు. వాహనాల ద్వంసం, దాడి ఘటనలో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు ప్రధాన నిందితుడిగా కేసు బుక్ చేశారు. బిగ్ బాస్‌లో పాల్గొన్న ఇద్దరి కంటెస్టెంట్ల అభిమానుల మధ్య గొడవ జరగడంతో కార్లు, ఆర్‌టిసి బస్సులపై దాడి చేశారు. ఈ దాడిలో కార్లు, ఆరు ఆర్టిసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. ఆర్‌టిసి అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అతడి అభిమానులపై కేసు నమోదు చేశారు.

ఈ దాడులకు ప్రశాంత్ కారణమని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్ ను చేర్చగా, ఎ-2గా అతని సోదరుడు మనోహర్, ఎ-3 గా అతని స్నేహితుడు వినయ్ ను చేర్చారు. ఎ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన సాయికిరణ్, అంకిరావుపల్లి రాజు అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విధ్వంసం సృష్టించిన వారిని గుర్తించేందుకు పోలీసులు వీడియోలను జల్లెడపడుతున్నారు. అందులో నిందితులను గుర్తించి మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం ఫోన్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సామాజిక మాద్యమాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News