హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 26కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని భవానీనగర్ మోయిన్బాగ్కు చెందిన సయిద్ గౌస్, మహారాష్ట్ర, జల్నా జిల్లా, పార్టూర్ గ్రామం, తాలూకాకు చెందిన షేక్ నిజాముద్దిన్ అలియాస్ మున్నా కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. ఇద్దరు కలిసి ఎపిలోని విశాఖపట్నం నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చి ముంబాయిలో విక్రయిస్తున్నారు. ఈ విధంగా విక్రయించేందుకు తీసుకువచ్చిన 26కిలోల గంజాయిని తమ వద్ద ఉంచుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్స్పెక్టర్ గట్టుమల్లు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి గంజాయిని పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను భవానీనగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -