Monday, April 29, 2024

గిరిజన మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ సరికాదు: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను తక్షణమే ఉద్యోగం నుండి తొలగించి,బాధిత కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అర్థరాత్రి ఎల్బీనగర్‌పోలీసుల థర్డ్ డిగ్రీలో తీవ్రగాయాలై బిఎన్ రెడ్డి నగర్ లోని శ్యామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన మహిళ  ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు.అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే,ఆమె పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన తీరు అమానవీయమన్నారు.

రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించి,మహిళపై మోకాళ్లు, పిక్కలు,తొడలపై లాఠీలతో చితకబాదడం దుర్మార్గమన్నారు. నగరం నడిబొడ్డున జరిగిన సంఘటనకు నైతిక బాధ్యత వహించిహోంమంత్రి రాజీనామా చేయాలన్నారు. భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల హైదరాబాద్ పాత బస్తీకి చెందిన సామజిక కార్యకర్త హత్య షేక్ సయీద్ బావజీర్ ను బండ్లగూడలో హత్యకు గురయ్యాడన్నారు.హత్యకు ముందే హోం మంత్రికి మహమూద్ అలీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన అతని ప్రాణాలు పోలీసులు కాపాడలేకపోయారని విమర్శించారు. దొంగతనం కేసులో అరెస్టు ఖదీర్ ఖాన్,మరియమ్మ లాకప్ డెత్ లు పోలీసుల హత్యలేనన్నారు. పోలీసులు కేవలం బహుజనుల మీదనే దాడులకు పాల్పడుతున్నారు కానీ లిక్కర్ స్కాంలో రూ.100 కోట్లు ముడుపులు చెల్లించిన నాయకులను మాత్రం ఈడీ పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళి విచారించారని విమర్శించారు. దేశంలో ఎక్కడో సంఘటన జరిగితే స్పందించే ప్రభుత్వ పెద్దలు నగరంలో జరిగిన జరిగిన సంఘటనకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట పరామర్శించినవారిలో డా.వెంకటేష్ చౌహన్, రాష్ట్ర నాయకులు గుండెల ధర్మేందర్, అరుణ క్వీన్, పంది లింగం, గ్యార మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News