Monday, April 29, 2024

25న ఢిల్లీకి పొంగులేటి, జూపల్లి…రాహుల్ గాంధీతో భేటీ, అదే రోజు కాంగ్రెస్‌లోకి..!?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వీరు హస్తం కండువా కప్పుకోనున్నారు. బుధవారం దీనిపై పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. అలాగే బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లనున్నారు. కాగా పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఖమ్మం, మహబూబ్ నగర్‌లలో బహిరంగ సభలు నిర్వహించాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఆ సభల్లోనే నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టుగా సమాచారం. ఇక, ఇప్పటికే జూపల్లి కృష్ణారావు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. శుక్రవారం కాంగ్రెస్ నేత సంపత్ జూపల్లి కృష్ణారావుతో ప్రత్యేకంగా సమావేశమై ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇక, రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జూమ్ కాల్ ద్వారా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. జూమ్ మీటింగ్‌లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ జూమ్ సమావేశం తర్వాత పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత వచ్చిందనే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ గూటికి పొంగులేటిని తీసుకు రావడంతో కర్ణాటక డిప్యూటీ సిఎం, కెపిసిసి చీఫ్ డికె శివకుమార్ కూడా కీలక భూమిక పోషించారనే ప్రచారం సాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News