Monday, April 29, 2024

కాంగ్రెస్ లోకి వెళుతున్నాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అగ్రనేతల సమక్షంలో జులై రెండో తేదీన ఆ పార్టీలో చేరనున్నారు. సోమవారం ఢిల్లీలోని ఎఐసిసి కా ర్యాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, అరికెల నర్సారెడ్డి, గురునాథ్‌రెడ్డిలతో పాటు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న ఇతర నేతలు కలిశారు. జులై 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్న సభకు రావాలని రాహుల్, మల్లికార్జున్ ఖర్గేలను టిపిసిసి నేతలు ఆ హ్వానించారు. ఆ సభలోనే మరింత మంది నేతలు కాంగ్రె స్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో అరగంట పాటు మాట్లాడా రు. కాంగ్రెస్ నేతలు అందరూ మళ్లీ సొంత పార్టీలోకి రా వడం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఘర్ వాపసీ జరుగుతుందని చెప్పారు. ‘కెసిఆర్ హఠావో తెలంగాణ బచావో’ నినాదంతో ముందుకు సాగాలని సలహా ఇచ్చారు. దాదాపుగా యాభై మంది నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తూ ఎఐసిసి ఆఫీసుకు వచ్చారు. వారితో పాటు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతులు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, చిన్నారెడ్డి , రేణుకాచౌదరి సహా కీలక నేతలంతా వచ్చారు. ఈ సందర్భంగా ఎఐసిసి కార్యాలయం సందడిగా మారింది. నేతలందరితో ఖర్గే, రాహుల్ గాంధీ ఫోటో సెషన్ నిర్వహించారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే కాంగ్రెస్‌లో చేరిక : పొంగులేటి
తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షలు స్వరాష్ట్రంలో ఒక్కటి కూ డా నెరవేరలేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశా రు. రాహుల్‌తో భేటీ తర్వాత ఎఐసిసి కార్యాలయంలో కీ లక నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగాకీలక వ్యాఖ్యలు చేశారు. తము పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్వేలు చేయించామని బిఆర్‌ఎస్‌పై ఎనభై శాతం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఓ దశలో తాము ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన కూ డా చేశామని, కానీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని బిఆర్‌ఎస్‌కు మేలు జరగకూడదన్న ఉద్దేశంతోనే తాము కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకుమన్నారు. బిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవ్వాల్సి ఉందని పొంగులేటి పిలుపు ని చ్చారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ గ్రాఫ్ పెంచిందని వివరించారు. కర్ణాటక విజయంతో హ స్తం పార్టీ మరింత పుంజుకుందని చెప్పారు. అన్ని పరిణామాలు బేరీజు వేసుకుని రాహుల్‌ను కలవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. రాష్ట్రం ఇచ్చినందుకు ప్రజ లు కాంగ్రెస్‌కు రుణపడి ఉన్నారని చెప్పారు. ‘ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చా రు. మాయ మాటలు చెప్పి ఉంటే 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. మాయమాటలతో బిఆర్‌ఎస్ రెం డోసారి కూడా అధికారంలోకి వచ్చారు. 6నెలల విశ్లేషణ తర్వాత కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం. జులై 2న ఖమ్మంలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతాం. కనీవిని ఎరుగని రీతిలో ఖమ్మం సభ జరుగుతుంది.

ప్రియాంకాగాంధీతో పొంగులేటి, జూపల్లి భేటీ
పార్టీ పెద్దలతో పొంగులేటి, జూపల్లి వరుసగా భేటీ అవుతున్నారు.. ఇప్పటికే.. రాహుల్, ఖర్గేతో సమావేశమైన ఆ ఇద్దరు నేతలు.. తాజాగా ప్రియాంకాగాంధీతోనూ సమావేశమయ్యారు. ఖమ్మంలో కాంగ్రెస్ సభ, పార్టీలో చేరికలతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

14 లేదా 16న కాంగ్రెస్‌లో చేరుతా : జూపల్లి
ఈసారి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వకపోతే దేవుడు కూ డా క్షమించడు. కాంగ్రెస్‌లోనే చేరాలని నిర్ణయించుకు న్నాం. జులై14 లేదా 16న రాహుల్ సమక్షంలో చేరు తాం. మహబూబ్‌నగర్‌లో నిర్వహించే సభలో కాంగ్రెస్‌లో చేరుతామ’ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌లో చేరబోతున్న 35 మంది నేతలతో కూడిన లిస్ట్ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి చేరింది. ఈ జాబితాను ఎఐసిసి విడుదల చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News