Saturday, April 27, 2024

నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత
11 రోజుల్లో నాగార్జునసాగర్‌లో 30 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ జెన్‌కో నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో నిల్ అవడంతో నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ ఉత్పత్తిని జెన్‌కో అధికారులు నిలిపివేసినట్టుగా సమాచారం. 11 రోజులుగా పోలీస్ పహారాలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగింది. ఈ 11 రోజుల్లో తెలంగాణ జెన్‌కో నాగార్జునసాగర్‌లో 30 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసింది. జూన్ 29 నుంచి అక్కడ జలవిద్యుదుత్పత్తిని జెన్‌కో ప్రారంభించింది. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని ఇలా చేపట్టడం వల్ల నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి వెళ్తున్నాయని కెఆర్‌ఎంబితోపాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అయితే విద్యుత్ ఉత్పత్తిని నిబంధనల మేరకే చేపడుతున్నామని తమకు కేటాయించిన నీటి వాటాను వాడుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 529.20 అడుగుల నీటిమట్టం ఉంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 312 టిఎంసీలు కాగా ప్రస్తుతం 166.5892 టిఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో నిల్‌గా ఉంది. ప్రస్తుతం 18,246 క్యూసెక్కుల నీరు బయటకు వెళుతోంది.
ఈ నెల 24వ తేదీన కెఆర్‌ఎంబీ పూర్తి స్థాయి సమావేశం
ఈ క్రమంలో ఎపి రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి, కెఆర్‌ఎంబికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వివాదం సహా కృష్ణా జలాల కేటాయింపులపై ఈ నెల 24వ తేదీన కెఆర్‌ఎంబీ పూర్తి స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే పలుమార్లు జల వివాదంపై చర్చలు జరగ్గా, మరోసారి జరిగే సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

Power generation stops at Nagarjuna sagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News