Friday, April 26, 2024

‘ప్రజా సంగ్రామ యాత్ర’ పాటలు విడుదల

- Advertisement -
- Advertisement -

హత్తుకునేలా పాటలున్నాయని అభినందించిన విజయశాంతి

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్ ఈనెల 28 నుండి చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు సంబంధించి ఆడియో పాటలు విడుదలయ్యాయి. ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి సీనియర్ నేత, మాజీ ఎంపి విజయశాంతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పాదయాత్ర కమిటీ ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి ఎ. రాకేష్ రెడ్డి తదితరులు ఈ ఆడియో పాటలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ ‘‘పాదయాత్ర పాటల లిరిక్స్ చాలా అద్బుతంగా ఉన్నాయి. భావోద్వేగపూరితంగా పాటలున్నాయి. గుండెను హత్తుకునేలా ఉన్నాయి. తెలంగాణ మారమూల ప్రాంతాల ప్రజలను ఆకట్టుకోవడం ఖాయం. ఇలాంటి పాటలు రాసిన వారందరికీ నా అభినందనలు’’అని తెలిపారు.
‘‘ బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం అవుతుందనే సంపూర్ణ నమ్మకం నాకుంది. ఈ యాత్రలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతున్నామని విజయశాంతి పిలుపునిచ్చారు. బిజెపి క్రమశిక్షణ, సిద్దాంతాలున్న పార్టీ. కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.  ‘‘ హుజూరాబాద్ లో జరిగే ఉప ఎన్నికల్లోనూ బిజెపి గెలుపు ఖాయమని, బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News