- Advertisement -
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో ఓ గర్భణి దుర్మరణం చెందింది. ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నప్పుడు గుండె పోటు రావడంతో గర్భణి చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఆమె చనిపోగానే వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కరీంనగర్ కు చెందని షహనాజ్ కు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకడంతో వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రి ఐసియులో ఆమె చికిత్స పొందుతుండగా గుండె పోటు రావడంతో చనిపోయారు. మహిళ మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Pregnant died with Swine Flu in Gandhi Hospital
- Advertisement -