Wednesday, May 1, 2024

దక్షిణ మధ్య రైల్వేలో ముందస్తు చర్యలు

- Advertisement -
- Advertisement -
Preliminary measures on the South Central Railway
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కరోనా కట్టడికి ఏర్పాట్లు
ఫ్లాట్ ఫారం 10 నుంచి గోదావరి, గౌతమి ఎక్స్‌ప్రెస్..
హజ్రత్ నిజాముద్దీన్, బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారం నెంబర్ ఒకటికి మార్పు

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సంక్రాంతి పండుగ సందర్బంగా భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొన్న దృష్ట్యా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దక్షిణ మధ్య రైల్వే అనేక ముందస్తు చర్యలు చేపట్టింది. ముందస్తు చర్యలన్నింటినీ ప్రయాణికులు తప్పకుండా పాటించాలని మరియు రైల్వే పాలనా విభాగ సిబ్బందికి సహకరించాలని కోరారు. స్టేషన్లలో ప్లాట్‌ఫారాలపై రద్దీని నియంత్రించడానికి ప్రయాణికులను వారి రైలు బయులుదేరే సమయానికి రెండు గంటల ముందుగా మాత్రమే స్టేషన్‌లోని అనుమతిస్తారు. ప్రయాణ టిక్కెట్లు/ ప్లాట్‌ఫారం టిక్కెట్లు కలిగి ఉన్న ప్రయాణికులను స్టేషన్‌లోకి అనుమతిస్తారు. ప్రయాణికులు రైళ్లు ఎక్కే సమయంలో భౌతికదూరం పాటించేలా కమర్షియల్ విభాగం సిబ్బందికి ఆర్‌పిఎఫ్ సిబ్బంది తోడ్పాటు అందిస్తారు. ఆర్‌పిఎఫ్ సిబ్బందిచే ప్రయాణికులకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. కోవిడ్ వ్యాప్తి నివారణకు స్టేషన్ పరిసరాలలో శానిటైజింగ్, పరిశుభ్రతకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అన్ని చర్యలు తీసుకుంటోంది.

ప్లాట్‌ఫారాలపై ప్రయాణికులు కాని వారిని తగ్గించడానికి సికింద్రాబాద్‌లో ప్లాట్ ఫారం టిక్కెట్టు ధరను ప్రస్తుత ధర రూ.10 నుండి రూ.50 పెంచారు. మాస్కులు ధరించని ప్రయాణికులు ప్లాట్‌ఫారాలపై ఉన్న స్టాల్స్‌లో లభించే మాస్కులు కొనుగోలు చేయాలని రైల్వే బృందాలు సూచిస్తున్నారు ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా, మాస్కులు ధరించేలా పర్యవేక్షణకు స్టేషన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు ప్రయాణించే రైలు కోచ్‌ల వద్దకి వెళ్లి ప్రయాణికులకు సూచనలు ఇస్తారు. రైల్వే పరిసరాలలో అందరూ తప్పకుండా ముఖానికి మాస్కులు ధరించాలి, లేనిచో భారతీయ రైల్వే చట్టం 2012 (రైల్వే పరిసరాలలో పరిశుభ్రత ఉల్లంఘనకు జరిమానా) ప్రకారం (రూ.500 వరకు) జరిమానా విధించనున్నారు. స్టేషన్లలో కోవిడ్ సంబంధించిన భద్రతా నిబంధనలను పాటించేలా మరియు వాటిని ఉల్లంఘిస్తే విధించే జరిమానాలపై ప్రయాణికుల కోసం నిరంతరం ప్రకటనలు ఇస్తున్నారు. స్టేషన్లలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు పరిచేలా సికింద్రాబాద్ స్టేషన్‌లో 10.01.2022 మరియు 11.01.2022 తేదీలో కమర్షియల్ విభాగం వారిచే విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మాస్కులు ధరించని ప్రయాణికులకు జరిమానా విధించారు.

నిబంధనలు ఉల్లఘించిన వారిని గుర్తించి మొత్తం 169 కేసులు నమోదు చేసి వారి నుంచి రూ.34,100 జరిమానగా వసూలు చేశారు. పండుగ సందర్భంగా ప్లాట్‌ఫారాలపై నెలకొనే రద్దీ దృష్ట్యా 2022 జనవరి 12వ తేదీ నుండి 21 తేదీ వరకు మూడు రైళ్ల ప్లాట్‌ఫారాలు మార్చారు. ట్రెయిన్ నెంబరు 12728 హైదరాబాద్ నుంచి విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారం నెం.10 నుంచి (ప్లాట్ ఫారం నెం. 1 బదులు) 17.10/17.15 గంటలకు బయలుదేరుతుంది. ట్రెయిన్ నెం.12738 లింగంపల్లి నుంచి కాకినాడ పోర్ట్ గౌతమి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారం నెం. 10 నుంచి (ప్లాట్‌ఫారం నెం. 1 బదులు) 21.10/21.15 గంటలకు బయలదేరుతుంది. ట్రెయిన్ నెం.22692 హజ్రత్ నిజాముద్దీన్ నుంచి బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారం నెం.1 నుంచి (ప్లాట్‌ఫారం నెం. 10బదులు) 17.20 / 17.25 గంటలకు బయలదేరుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News