Monday, April 29, 2024

25 నుంచి 28 వరకు రాష్ట్రపతి జమ్మూ కశ్మీరు, లడఖ్ పర్యటన

- Advertisement -
- Advertisement -

President Kovind to Visit Jammu and Kashmir

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జమ్మూ కశ్మీరు, లడఖ్‌ను సందర్శించనున్నట్లు రాష్ట్రపతి భవన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 1999లో కార్గిల్ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరులైన భారత సాయుధ దళాలకు కార్గిల్ విజయ్ దివస్ 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కార్గిల్ వార్ మెమోరియల్ ద్రాస్(లడఖ్) వద్ద సోమవారం(26వ తేదీ) రాష్ట్రపతి కోవింద్ నివాళులర్పిస్తారు. మరుసటి రోజు(27న) శ్రీనగర్‌లోని కశ్మీర్ విశ్వవిద్యాలయం 19వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని ప్రకటనలో తెలిపారు.

President Kovind to Visit Jammu and Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News