Wednesday, May 1, 2024

ట్రంప్ కు ఘన స్వాగతం పలికిన మోడీ

- Advertisement -
- Advertisement -

 


గాంధీనగర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ట్రంప్‌తో పాటు భార్య మెలానియా, కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరేడ్ కుష్నేర్ తదితరలకు మోడీ స్వాగతం పలుకుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన భార్య మెలానియాతో కలిసి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు.   అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆశ్రమం వరకు వీరికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ట్రంప్‌ దంపతులకు ప్రధాని నరేంద్ర మోడీ శాలువా కప్పిన అనంతరం ఆశ్రయం వివరాలను తెలియజేశారు. ఆశ్రమంలోని గాంధీ చిత్రపటానికి ట్రంప్‌ నూలు దండ వేసి  నివాళులర్పించారు.   మహాత్మా గాంధీ గౌరవార్థం  ట్రంప్‌ తన షూస్‌ విప్పి ఆశ్రమం లోపలికి వెళ్లారు. ఆశ్రయం లోపలికి వెళ్తున్నప్పుడు రిజస్టర్ లో సంతకం చేశారు. హృదయ్‌కుంజ్‌లో ఉన్న చరఖాను  ట్రంప్ తిప్పుతునేటప్పుడు   మెలానియా ఆసక్తిగా తిలకించారు. మధ్యాహ్నం.1.05 గంటలకు మోతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ సభకు డోనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు.

 

 

 

 

 

 

 

Prime Minister Narendra Modi greets Donald Trump
Prime Minister Narendra Modi greets Donald Trump

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News