Monday, April 29, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగాలి: ప్రొఫెసర్‌ శాంతా సిన్హా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా సామాజిక సేవకురాలు, రామన్ మెగాసెసే అవార్డ్ గ్రహీత ప్రొఫెసర్‌ శాంతా సిన్హా పాల్గొన్నారు. ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శాంత సిన్హా మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, ప్రతి ఒక్కరు చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. తన వంతుగా మొక్క నాటాని, ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపి సంతోష్ కుమార్ ను ప్రొఫెసర్ శాంతా సిన్హా అభినందనలు తెలియజేస్తూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగాలని ఆకాక్షించారు.

Professor Shanta Sinha Plant Saplings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News