Friday, May 17, 2024

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: అరెకపూడి గాంధీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మాదాపూర్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్షం అన్ని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం హఫీజ్‌పేట్ డివిజన్ ఆర్‌టిసి కాలనీకి చెందిన కృష్ణంరాజుకు అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహయ నిధి సిఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల ఆర్థిక సహయంను బాధిత కుంటుంబానికి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పోందిన నిరుపేదలకు, అభ్యాగులకు అండగా సీఎం సహయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీను, శ్రీనివాస్‌రావు, పద్మారావు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News