Saturday, April 27, 2024

క్యూఆర్ కోడ్‌తో కొట్టేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

QR Code scanning frauds in Hyderabad

ఓఎల్‌ఎక్స్ వేదికగా నేరాలు
ఇద్దరు బాధితులను మోసం చేసిన రాజస్థాన్ సైబర్ ముఠా
రూ.1,56,500కొట్టేసిన నిందితులు
దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు

హైదరాబాద్: సైబర్ నేరస్థులు తమకు చిక్కిన వారిని అన్ని విధాలా దోచుకుంటున్నారు. పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా కూడా బాధితులు మారడంలేదు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు నిందితులను నమ్మించి డబ్బులు కొట్టేశారు. తమ ఇంట్లో ఉన్న వస్తువులను విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో పెట్టగా కొనుగోలు చేస్తామని చెప్పి నిండా ముంచారు. రాజస్థాన్‌కు చెందిన ఈ సైబర్ ముఠా ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్, క్వికర్‌ను వేదికగా చేసుకుని ఛీటింగ్ చేస్తున్నారు. అమ్మకాలు, కొనుగోలు పేరుతో పలువురు అమాయకులను మోసం చేస్తున్నారు. బాధితులకు క్యూ ఆర్ కోడ్ పంపిస్తూ వారి బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులను కొట్టేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూకట్‌పల్లికి చెందిన బాధితురాలు ఈ నెల 17వ తేదీన తన ఇంట్లోని సోఫాను రూ.23,500కు విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ఫొటోలు పెట్టింది. దీనిని చూసిన సైబర్ నేరస్థులు వినోద్ పేరుతో ఫోన్ చేసి సోఫాను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు.

కానీ డబ్బులు ఆన్‌లైన్ ద్వారా పంపిస్తామని చెప్పాడు. తాము క్యూఆర్ కోడ్ పంపిస్తామని దానిని స్కాన్ చేసి రూ.1 పంపిస్తే మిగతా డబ్బులు పంపిస్తామని చెప్పాడు. దానిని నిజమని నమ్మిన బాధితురాలు తన ఎస్‌బిఐ ఖాతాకు క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసింది. ఇలా పలుసార్లు చేయడంతో ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.99,500 నిందితుడి బ్యాంక్ ఖాతాకు వెళ్లిపోయాయి. సుచిత్రకు చెందిన మరో బాధితురాలు గత ఏడాది డిసెంబర్ 31,2020న తన వద్ద ఉన్న డ్రెస్సింగ్ టేడెస్సింగ్ విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ఫొటోలు పెట్టింది, రూ.3,500కు విక్రయించనున్నట్లు పేర్కొంది. సైబర్ నిందితుడు ప్రవీణ్‌కుమార్ పేరుతో ఫోన్ చేసి కొనుగోలు చేస్తానని, డబ్బులు ఆన్‌లైన్‌లో పంపిస్తానని తాను పంపించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పడంతో అలాగే చేసింది. దీంతో బాధితురాలి బ్యాంక్ ఖాతా నుంచి రూ.57,000 నిందితుడి బ్యాంక్ ఖాతాకు వెళ్లిపోయాయి. దీంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫేస్‌బుక్, ఓఎల్‌ఎక్స్ వేధికగా : రాజస్థాన్‌కు చెందిన సైబర్ క్రైం నేరస్థులు ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్, క్వికర్ వెబ్‌సైట్లను వేదికగా చేసుకుని నేరాలు చేస్తున్నారు. అమాయకులకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. వస్తువులు కొనుగోలు చేస్తామని లేదా తక్కువ ధరకు విక్రయిస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు దోచుకుంటున్నారు. అంతేకాకుండా బాధితుల నంబర్లు తీసుకుని వాటితో ఛాటింగ్ చేస్తున్నారు. దీనిని నిజమని నమ్మిన బాధితులు సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నిందితులు రూ.1 లేదా రూ.5 ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరడంతో నిజమని నమ్మి మోసపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News