Friday, April 26, 2024

రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం 175

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 13లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్, మోర్గాన్ ధాటిగా ఆడడంతో రాజస్థాన్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా ఉంచింది. కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్లు శుభ్ మన్ గిల్(47), మోర్గాన్ (34), రస్సెల్ (24), రానా(22), నరీన్(15), కమ్నీస్(12) మిగితా వారు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు తీయగా రాజ్ పూత్, ఉనద్కత్, కుర్రాన్, రాహుల్ తెవాటియా తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News