Sunday, May 5, 2024

రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం 224

- Advertisement -
- Advertisement -

షార్జా: ఐపిఎల్‌ 13వ సీజన్ లో భాగంగా  కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 224 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ రాయల్స్  ముందు ఉంచింది. పంజాబ్ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ సెంచరీతో మాయచేశాడు. ఏడు సిక్స్ లు, పది ఫోర్ల సహాయంతో 50 బంతుల్లో అగర్వాల్ 106 పరుగులు చేసి కుర్రాన్ బౌలింగ్ లో శామ్సన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి వికెట్ పై అగర్వాల్, రాహుల్ 183 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  రాహుల్ 69 పరుగులు చేసి రాజ్ పూట్ బౌలింగ్ లో గోపాల్ కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో ఔటయ్యాడు. మ్యాక్స్ వెల్(13), పూరాన్(25) పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు దారుళంగా పరుగులు సమర్పించుకున్నారు. రాజ్ పూట్, కుర్రాన్ చెరో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News