చెన్నై: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమాని హీరో విజయ్ అభిమానిని కొట్టి చంపిన సంఘటన తమిళనాడులోని విళ్లుపురం ప్రాంతం మరకణ్ణమ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శాందికప్పన్ దేవాలయం వీధిలో యువరాజ్, దినేష్ బాబు అనే యువకులు ఎదురెదురు ఇంట్లో నివసిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీ కాంత్కు దినేష్ బాబు వీరాభిమాని, యువరాజు మాత్రం విజయ్ అభిమాని. కాని ఇద్దరి మధ్య కరోనా వైరస్ గురించి చర్చ జరిగింది. కోవిద్-19 రిలీఫ్ ఫండ్కు హీరో రజనీ కాంత్, విజయ్… ఎవరు ఎక్కువ విరాళం ఇస్తారా? అని ఛాలెంజ్ చేసుకున్నారు. ఇద్దరు మధ్య వాదోపవాదాలు నడిచిన అనంతరం రజనీ కాంత్ పై యువరాజు కామెంట్ చేయడంతో దినేష్ బాబు ఆగ్రహంతో ఊగిపోయి రాయితో అతడిని కొట్టాడు. యువరాజు కుడి కంటి భాగంలో బలంగా రాయి తగలడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యువరాజు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దినేష్ బాబును అరెస్టు చేశారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం కళాపేట ఆస్పత్రికి తరలించారు.
Rajinikanth fan murder Vijay fan due to donation